కరోనా, లాక్డౌన్ కారణంగా చాలా మంది చాలా నష్టపోయారు. పోగొట్టుకున్నారు కూడా. ముఖ్యంగా కరోనా ప్రభావం సినిమాల ప్రధానంగా ప్రభావం చూపింది. దీని కారణంగా భారీ చిత్రాలు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. సినిమా రిలీజ్లు కూడా లేదు. థియేటర్లు మూసేయడంతో తెలుగు సినిమాల రిలీజ్లు ప్రశ్నార్థకంగా మారాయి. ఎప్పుడు సాధారణ పరిస్థితుల ఏర్పడతాయో తెలియదు. ప్రభుత్వం షూటింగ్లకు అనుమతులు ఎప్పుడు ఇస్తుందో తెలియదు.
ఈ నేపథ్యంలో మేకర్స్ అంతా సినిమా నిర్మాణం విషయంలో పునరాలోచనల్లో పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కరోనా ఎఫెక్ట్ రవితేజ సినిమాపై పడినట్టు తెలుస్తోంది. రవితేజ హీరోగా రమేష్వర్మ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ మూవీ స్టార్ట్ కాలేదు. అయితే ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాని పక్కన పెట్టిన రవితేజ ఆ స్థానంలో వక్కంతం వంశీ చిత్రాన్ని ఓకే చేసినట్టు చెబుతున్నారు. రవితేజ నటిస్తున్న తాజా చిత్రం `క్రాక్`. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆస్కార్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరలక్ష్మి శరత్కుమార్ విలన్గా కీలక పాత్రలో నటిస్తోంది. కరోనా ప్రభావం లేకపోతే `క్రాక్` ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది.