మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ గత నెలలో తిరిగి ప్రారంభమైన విషయం తెల్సిందే. అయితే చిరంజీవి మాత్రం కొన్ని రోజులు ఆలస్యంగా ఈ షూటింగ్ కు హాజరయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఇక ఆచార్యలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపిస్తాడు అన్న విషయం ఇప్పటికే అధికారికంగా వెల్లడైంది. అయితే ఆ పాత్ర దాదాపు 30 నిముషాలు ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్నను తీసుకున్నారని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఇంకా రామ్ చరణ్ సరసన హీరోయిన్ ను ఫైనలైజ్ చేయలేదట. నిజానికి చరణ్ వచ్చే మార్చ్ లో ఆచార్య షూటింగ్ లో పాల్గొంటాడట. అందుకే హీరోయిన్ విషయంలో ఎలాంటి తొందరా ప్రదర్సించట్లేదు ఆచార్య టీమ్.
చరణ్ కు హీరోయిన్ గా బాలీవుడ్ నటిని తీసుకోవాలని ముందు నుండి అనుకుంటున్నారు. ఇలా అయితే నార్త్ వైపు కూడా చిత్రానికి క్రేజ్ ఉంటుందని అనుకుంటున్నారు. సో వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ హీరోయిన్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు.