మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కు కమిటై ఉన్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూట్ కరోనా వల్ల ఆలస్యమవడంతో ఎప్పటి నుండి షూటింగులు తిరిగి మొదలవుతాయో, ఎప్పటికి ఈ చిత్రం పూర్తవుతుందో ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా ఏ సినిమాకూ కమిటవ్వలేదు. అయితే తన తండ్రి చిరంజీవి హీరోగా చేస్తోన్న ఆచార్యలో రామ్ చరణ్ స్పెషల్ రోల్ పోషిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న విషయం తెల్సిందే.
మరోవైపు గత కొన్ని రోజులుగా వంశీ పైడిపల్లి చెప్పిన కథకు రామ్ చరణ్ ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఈ వార్తకు సంబంధించి రీసెంట్ గా వచ్చిన ఒక అప్డేట్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. అదే ఈ చిత్రాన్ని మహేష్ బాబు నిర్మించనుండడం.
వంశీ పైడిపల్లితో సినిమా చేస్తానని మహేష్ బాబు మాట ఇచ్చాడు, అయితే అది తాను హీరోగా కుదరకపోవడంతో రామ్ చరణ్ కు ఈ కథను సిఫార్సు చేయడం, తానే నిర్మిస్తానని ముందుకు రావడం జరిగాయట. మరి ఈ విషయంలో ఎంతవరకూ నిజముందో వారికే తెలియాలి.