ప్రతీ వందేళ్ల కొకసారి ఓ మాయదారి వైరస్ మానవాళిన కబళిస్తూనే వుంది. ఆ సమయం మళ్లీ ఇప్పుడు వచ్చింది. కరోనా రూపంలో మానవాళిని భయంకరమైన వైరస్ జనాన్ని మింగేస్తోంది. ఇప్పటికే విదేశాల్లో రికార్డు స్థాయి మరణాలు జోటు చేసుకుంటున్నాయి. స్పెయిన్, ఇటలీ, అమెరికా దీని ధాటికి కకావికలం అయిపోతున్నాయి. అక్షల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఒక్క అమెరికాలోనే రెండు లక్షల మంది దీని దెబ్బకు తుడిచిపెట్టుకుపోవచ్చని ఇప్పటికే అమెరికా వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి.
ఇదిలా వుంటే ఈ మహమ్మారి భారిన పడి చాలా మంది ఆధారం కోల్పోయారు. నిత్యం రెక్కడితేనే డొక్కాడే జీవితాలు ప్రస్తుంతం దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. వదీన్ని దృష్టిలో పెట్టుకుని సెలబ్రిటీలు వారికి ఆపన్న హస్తం అందించేందుకు ముందుకొస్తున్నారు. కొంత మంది భారీ విరాళాలు ప్రకటించి తమ ఊదరతను చాటుకుంటుంటే స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ 200 కుటుంబాలకు రెండు పూటల భోజనాన్ని సరఫరా చేసి తన గొప్ప మనసును చాటుకుంది.
గురుగ్రామ్లోని తన ఇంటి సమీపంలో వుండే రోజు వారీ కూలీలని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. తన ఇంటికి సమీపంగా వుండే 200 వందల కుటుంబాలకు రెండు పూటలా భోజనాన్ని అందించి వారి మనసు గెలుచుకుంది. ఇది ఒక్క రోజు కాదు లాక్ డౌన్ ఎత్తేసే వారకు ఇలాగే ఈ కుటుంబాలకు తన ఇంటి నుంచే భోజనాన్ని రెండు పూటలా రకుల్ అందిస్తుండటంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.