సూపర్ స్టార్ రజినీకాంత్ ను హైదరాబాద్ లో అపోలో హాస్పిటల్స్ లో జాయిన్ చేసిన విషయం తెల్సిందే. అన్నాతై షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు రజిని. గత కొంత కాలంగా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే అన్నాతై సెట్స్ లో పనిచేసే 8 మందికి కరోనా సోకడంతో వెంటనే రజినీ కరోనా టెస్టులు చేయించుకున్నారు.
అదృష్టవశాత్తూ ఆయనకు కరోనా నెగటివ్ అని తేలింది. అయితే అప్పటినుండి హైదరాబాద్ లోనే క్వారంటైన్ లో ఉంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం బీపీలో అసహజ మార్పులు, ఊపిరి సరిగా అందకపోవడం వంటి కారణాలతో రజినీకాంత్ అపోలో హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యారు. అప్పటినుండి రజిని ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష అందిస్తూ వస్తున్నారు వైద్యులు. తాజా సమాచారం ప్రకారం అపోలో హాస్పిటల్స్ రజినీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.
ఆయన ఆరోగ్యం విషయంలో కంగారు పడాల్సింది ఏం లేదని తెలిపింది. ఈరోజు మరోసారి పరీక్షలు చేసి దాని తర్వాత డిశ్చార్జ్ విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రజినీ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుసుకున్న ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.