తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్లో చేరారు. విషయం తెలిసి అంతా షాక్కు గురవుతున్నారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ సిబ్బంది ఓ ప్రకటనని విడుదల చేశారు. `రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు. బీపీని అదుపు చేసేందుకు చికిత్స అందిస్తున్నాం. ఈ సమస్య తప్ప ఇతర ఇబ్బందులేమీ లేవు. రకత్ పోటు అదుపులోకి రాగానే రజనీకాంత్ని డిశ్చార్జ్ చేస్తాం. ఈ నెల 22న నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది` అని సదరు ప్రకటనలో పేర్కొన్నారు.
రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం `అన్నాత్తే`. సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, మీనా, కీర్తి సురేష్, ఖుష్బూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. లాక్డౌన్కి ముందు ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ కరోనా వల్ల ఏర్పడిన లాక్డౌన్ కారణంగా గత 10 నెలలుగా ఆగిపోయింది. ఇటీవలే ఈ చిత్ర తాజా షెడ్యూల్ని హైదరాబాద్లో షూటింగ్ మొదలైంది.
కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ షూటింగ్ ప్రారంభించారు. అయితే చిత్ర బృందంలోని కొంత మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఈ చిత్ర షూటింగ్ని నిలిపివేశారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 22న రజనీకి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. దీంతో ఆయన గత కొన్ని రోజులుగా స్వీయ నిర్భంధంలో వుంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడంతో హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చేరారు.