సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా దర్బార్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే .రజనీకాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తోంది . లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు . కాగా ఈ చిత్రాన్ని 2020 జనవరి లో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
అసలు ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలనీ అనుకున్నారు అయితే అనుకున్న స్థాయిలో షెడ్యూల్స్ పూర్తికాకపోవడంతో విడుదల వాయిదాపడింది . దసరా కు అనుకున్న సినిమాని సంక్రాంతి కి విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారట . గతకొంత కాలంగా రజనీకాంత్ కు సరైన సక్సెస్ ఏది అందడం లేదు . చేస్తున్న సినిమాలన్నీ ఘోర పరాజయం పొందుతూనే ఉన్నాయి దాంతో ఈ సినిమా దర్బార్ అయినా హిట్ అవుతుందా ? అన్న టెన్షన్ రజనీ ఫ్యాన్స్ లో నెలకొంది .