Homeటాప్ స్టోరీస్ఆస‌క్తిగా మారిన రాఘ‌వ లారెన్స్ పోస్ట్‌!

ఆస‌క్తిగా మారిన రాఘ‌వ లారెన్స్ పోస్ట్‌!

ఆస‌క్తిగా మారిన రాఘ‌వ లారెన్స్ పోస్ట్‌!
ఆస‌క్తిగా మారిన రాఘ‌వ లారెన్స్ పోస్ట్‌!

రాఘ‌వ లారెన్స్ తాజాగా చేసిన ట్వీట్ త‌మిళ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గ‌త కొన్నేళ్లుగా సోష‌ల్ యాక్టివిటీస్‌లో ముందుంటున్న లారెన్స్ తాజాగా త‌న మ‌న‌సులో మాట‌ని బ‌య‌ట‌పెట్టారు. చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తూ అండ‌గా నిలుస్తున్న లారెన్స్ ఇక‌పై కొత్త అడుగు వేయ‌బోతున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. `చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా ఎంతో మందికి స‌హాయం చేస్తున్నాన‌ని, రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తే అంత‌కు మించి సేవ‌లందిస్తాన‌ని నా స్నేహితుల‌, శ్రేయోభిలాషులు అంటున్నార‌న్నారు లారెన్స్‌.

నాకూ అనిపించింది. సింగిల్‌గా ఇంత చేస్తున్న‌ప్పుడు రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తే మ‌రెంతో మందికి సాయ‌ప‌డ‌గ‌ల‌న‌ని అనిపించింది. అందుకే నేను రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాల‌నుకుంటున్నాను. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ కాంత్  పార్టీలో  చేర‌బోతున్నాన‌న్నారు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌కు తానెప్పుడూ దూరంగా వుంటాన‌ని, ర‌జ‌నీ కాంత్ త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని ఎప్పుడూ కాపాడుకుంటాన‌న్నారు.

- Advertisement -

`ఎన్నో ఏళ్లుగా అనేక ర‌కాలుగా స‌మాజానికి సేవ చేస్తున్నా, నా సేవాకార్య‌క్ర‌మాలు చూసి ఎంతో మంది అభిమానులు, స‌న్నిహితులు న‌న్ను రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఎప్ప‌టి నుంచో అడుగుతున్నారు. వారంద‌రికీ ఈ రోజు ఓ శుభ‌వార్త చెబుతున్నాను. నా గురువు ర‌జ‌నీకాంత్ పార్టీ ప్ర‌క‌ట‌న అనంత‌రం ఆయ‌న బాట‌లో న‌డుస్తాం` అని ట్వీట్ చేశారు లారెన్స్ . చివ‌ర్లో తాను న‌వంబ‌ర్‌లో ర‌జ‌నీ పార్టీలో చేర‌బోతున్న‌ట్టు లారెన్స్ హింట్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All