Homeటాప్ స్టోరీస్రాఘ‌వ లారెన్స్ సంచ‌ల‌న నిర్ణ‌యం!

రాఘ‌వ లారెన్స్ సంచ‌ల‌న నిర్ణ‌యం!

రాఘ‌వ లారెన్స్ సంచ‌ల‌న నిర్ణ‌యం!
రాఘ‌వ లారెన్స్ సంచ‌ల‌న నిర్ణ‌యం!

రాఘ‌వ లారెన్స్ డ్యాన్స‌ర్‌గా, న‌టుడిగా, హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. వివాదాల‌కు దూరంగా వుంటూ అనాథ‌ల్ని చేర‌దీస్తూ వారికి అండ‌గా నిలుస్తున్న ఆయ‌న తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవ‌ల ర‌జ‌నీకాంత్ న‌టించిన `ద‌ర్బార్‌` ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మంలో లారెన్స్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న అభిమానాన్ని చాటుకునే ప్ర‌య‌త్నంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు త‌మిళ నాట ర‌జ‌నీ, క‌మ‌ల్ అభిమానుల మ‌ధ్య‌ దుమారాన్ని రేపుతున్నాయి.

చిన్న‌త‌నం నుంచి తాను ర‌జ‌నీకాంత్ అభిమాన‌ని, ఆ స‌మ‌యంలో క‌మ‌ల్‌హాస‌న్ సినిమా విడుద‌లైతే ఆ సినిమా పోస్ట‌ర్ల‌పై పేడ కొట్టేవాడిన‌ని, అయితే రోజులు మారాయ‌ని, ఇప్పుడు ఇద్ద‌రు క‌లిసి న‌డుస్తున్నార‌ని, స్నేహం కంటే ఏదీ గొప్ప‌కాద‌ని తెలుసుకున్నాన‌ని లారెన్స్ అన్న మాట‌లు వివాదానికి దారి తీశాయి.
దీంతో ఆగ్ర‌హించిన క‌మ‌ల్‌హాస‌న్ అభిమానులు, నెటిజ‌న్స్ లారెన్స్‌పై విరుచుకుప‌డ్డారు. క‌మ‌ల్‌ని విమర్శించ‌డంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా లారెన్స్‌పై విమర్శ‌ల వ‌ర్షం కురిపించారు.

- Advertisement -

జ‌రుగుతున్న న‌ష్టాన్ని గ్ర‌హించిన దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగిన లారెన్స్ ఇటీవ‌ల `ద‌ర్బార్‌` ఆడియో రిలీజ్‌లో అన్న మాట‌ల‌పై ర‌జ‌నీకి వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ఈ వివాదం నేప‌థ్యంలో లారెన్స్ సోష‌ల్ మీడియా వేదిక పెట్టిన పోస్ట్ సంచ‌ల‌నంగా మారింది. ఇక‌పై బ‌య‌ట జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు తాను హాజ‌రు కాబోన‌ని, దానికి చాలా కార‌ణాలు వున్నాయ‌ని, ఆ వివారాల్ని వెల్ల‌డించ‌లేని, ర‌జ‌నీ దీవెన‌ల‌కు మించి త‌న‌కు ఏదీ ఎక్కువ కాద‌ని లారెన్స్ ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All