తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ `చంద్రముఖి`. పి.వాసు దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ చిత్రం రజనీకి హీరోగా రీబర్త్నిచ్చింది. ఇక ఇక్కడి నుంచి రజనీ తన హవాని మళ్లీ చూపించడం మొదలుపెట్టారు. ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఈ చిత్రానికి సీక్వెల్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇందులో రాఘవ లారెన్స్ నటించనున్నారట. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధిమారన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని రాఘవ లారెన్స్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదిక వెల్లడించారు.
అంతే కాకుండా ఈ చిత్రం కోసం తనకు అందించిన అడ్వాన్స్లో కరోనా బాధితుల కోసం 3 కోట్లు విరాళం ప్రకటించి తన గొప్ప మనసు చాటుకున్నారు లారెన్స్. స్నేహితులు, అభిమానులకు నేనొక పంతోషకరబైన విషయాన్ని వెల్లడించాలనుకుంటున్నాను. నా అభిమాన నటుడు తలైవర్ రజనీకాంత్ నటించిన `చంద్రముఖి`కి సీక్వెల్గా రానున్న చిత్రంలో నటించనున్నాను. రజనీకాంత్ అనుమతితో దర్శకుడు పి.వాసు. నా లక్కీ ప్రొడ్యూసర్ కళానిధిమారన్ ఆశీస్సులతో దక్కిన ఈ అవకాశాన్ని నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను` అన్నారు.
ఈ చిత్రం కోసం తనకు ఇచ్చిన అడ్వాన్స్లో 3 కోట్లని కరోనా బాధితుల కోసం విరాళంగా అందిస్తున్నాను. ఇందులో పీఎం కేర్స్కు 50 లక్షలు, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్కు 50లక్షలు, పెఫ్సీకి 50 లక్షలు, డ్యాన్సర్స్ యూనియన్కు 50 లక్షలు, దివ్యాంగులకు 25 లక్షలు, నా స్వస్థలం రోయపురంలోని ప్రజలకు, దినసరి కూలీలకు 75 లక్షలు విరాళంగా అందిస్తున్నాను` అన్నారు లారెన్స్.