యావత్ భారతదేశంలో విశేషంగా చేసుకునే పండగల్లో నవరాత్రి కూడా ఒకటి. ఈరోజు నుండి దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు దేవి నవరాత్రులను నిర్వహిస్తారన్న విషయం తెల్సిందే. రోజుకో రూపంలో అమ్మవారిని అలంకరణ చేసి పూజిస్తారు. ఇదిలా ఉంటే సీనియర్ నటి రాధికా ఈరోజు ట్విట్టర్ లో నవరాత్రి స్పెషల్ అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ప్రస్తుత టాప్ హీరోయిన్ రష్మిక మందన్నతో పాటు రాధికా, ఊర్వశి కూడా ఉన్నారు.
మహానటి సావిత్రి నవరాత్రి సాంగ్ కు రాధికా, ఊర్వశి డ్యాన్స్ చేయగా మధ్యలో రష్మిక సిగ్గుపడుతూ నిల్చుని ఉంది. రష్మికను రాధికా డాల్ అని సంబోధించడం విశేషం. ఈ ముగ్గురూ కలిసి ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమా చేస్తున్నారు. ఆ సినిమా సెట్స్ నుండే ఈ వీడియో పోస్ట్ చేసారు.
శర్వానంద్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రాధికా, ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న కొన్ని వివక్షలను పాయింట్ అవుట్ చేసే విధంగా ఈ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది.