పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం `రాధేశ్యామ్`. రొమాంటిక్ పిరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని `జిల్` ఫేమ్ రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్పై యువీ కృష్ణంరాజు సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ప్రధానంగా ఇటలీ నేపథ్యంలో సాగనుంది.
`ప్రేమ పావురాలు` ఫేమ్ భాగ్యశ్రీ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్ర మోషన్ పోస్టర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చిత్ర బృందాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నంచడం దానికి చిత్ర బృందం త్వరలో వుంటుందని చెప్పడం .. ఆ తరువాత రిలీజ్ చేయడం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర టీజర్ కోసం కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా దర్శకుడు, చిత్ర నిర్మాణ సంస్థపై చిన్న పాటి యుద్ధమే చేస్తున్నారు.
టీజర్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ సోషల్ మీడియా వేదికగా దర్శకుడు రాధాకృష్ణకుమార్తో పాటు మేకర్స్పై ప్రశ్న వర్షం కురిపించారు. దీనికి దర్శకుడు త్వరలోనే టీజర్ వచ్చేస్తోందని వివరణ ఇచ్చారు. కానీ ఇంత వరకు దానికి సంబంధించిన అప్డేట్ లేకపోవడంతో మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ మేకర్స్ని నిలదీసే ప్రయత్నం చేశారు. `రాధేశ్యామ్` టీజర్ ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న రిలీజ్ కానుందంటూ సోషల్మీడియాలో రచ్చ చేస్తున్నారు. మేకర్స్ మాత్రం దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వ లేదు.