యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ `ఆదిపురుష్`. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రాన్ని టి. సిరీస్ బ్యానర్పై భూషన్కుమార్, కృష్ణకుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. పౌరాణిక గాధగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 3 డి ఫార్మాట్లో 400 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించబోతున్నారు.
హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్లతో దేశంలోనే మొట్టమొదటి సారిగా హాలీవుడ్ చిత్రాలత తరహాలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోషన్ క్యాప్చర్ వర్క్ని జనవరి 19 న చిత్ర బృందం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రోజు గొప్ప ముహూర్తం కావడంతో ఈ చిత్రాన్ని లాంఛనంగా మంగళవారం ప్రారంభించారు.
చిత్రం ప్రారంభించిన సందర్భంగా అధికారిక టైటిల్ పోస్టర్ను ఆవిష్కరించారు. పోస్టర్లోని శీర్షికగా `చెడు మీద మంచి విజయాన్ని జరుపుకుంటుంది` అని రాశారు. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. అయితే సీత పాత్ర కోసం ఇంకా అన్వేషణ చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రను పోషించనున్న విషయం తెలిసిందే.
#Adipurush aarambh. #Prabhas #SaifAliKhan #BhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries pic.twitter.com/LbHvEFhmFF
— Om Raut (@omraut) February 2, 2021