Homeటాప్ స్టోరీస్`రాధేశ్యామ్‌` టీమ్ వెన‌క్కిరాక త‌ప్ప‌దా?

`రాధేశ్యామ్‌` టీమ్ వెన‌క్కిరాక త‌ప్ప‌దా?

`రాధేశ్యామ్‌` టీమ్ వెన‌క్కిరాక త‌ప్ప‌దా?
`రాధేశ్యామ్‌` టీమ్ వెన‌క్కిరాక త‌ప్ప‌దా?

ప్ర‌భాస్ వ‌రుస‌గా పాన్ ఇండియా స్థాయి చిత్రాల‌ని లైన్‌లో పెట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో యువీ క్రియేష‌న్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే తొలిసారి ప్ర‌భాస్‌తో క‌లిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

`సాహో` రిలీజ్‌కి ముందే ఈ మూవీ షూటింగ్ మొద‌లైనా క‌రోరా ప్ర‌బ‌లుతున్న స‌మ‌యంలో ఇట‌లీ వెళ్లారు. అక్క‌డ‌, జార్జియాలో కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించాల‌ని ప్లాన్ చేశారు. కొంత వ‌ర‌కు షూటింగ్ జ‌రిగింది కూడా. ఈ లోగా ఇట‌లీలో క‌రోనా స్వైర‌విహారం చేస్తుండ‌టంతో చిత్ర బృందం అర్థాంత‌రంగా ఇటీలీ నుంచి ఇండియా రావాల్సి వ‌చ్చింది.

- Advertisement -

ఇటీవ‌ల మ‌రోసారి చిత్ర బృందం ఇట‌లీ వెళ్లింది. అసంపూర్తిగా ఆపేసిన స‌న్నివేశాల్ని తిరిగి ఆరు నెల‌ల త‌రువాత చిత్రీక‌రించ‌డం మొద‌లుపెట్టింది. ఓ వారం షూటింగ్ పూర్త‌యింది. మ‌రో వారం షూట్ చేయాల్సి వుంది. అయితే తాజాగా ఇట‌లీలో క‌రోనా కేసులు మ‌ళ్లీ ప్ర‌బ‌లుతుండ‌టంతో అక్క‌డి ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ప‌బ్లిక్ స్లేస్‌ల‌లో నిబంధ‌న‌ల్ని క‌ఠిన త‌రం చేశారు. దీంతో `రాధేశ్యామ్‌` టీమ్ షూటింగ్ చేయ‌డం క‌ష్టంగా క‌నిపిస్తోందని ప‌రిస్థితి అదుపు త‌ప్పితే చిత్ర బృందం ఇట‌లీ నుంచి మ‌ళ్ల వెన‌క్కి తిరిగి రావాల్సిందే అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All