బండ్లగణేష్, హరీష్ శంకర్ల మధ్య ఇటీవల పరోక్షంగా మాటల యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. `గబ్బర్సింగ్` సినిమా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తన పేరుని ప్రస్థావించకపోవడంతో హర్ట్ అయిన బండ్ల గణేష్ ఇండైరెక్ట్గా దర్శకుడు హరీష్ శంకర్పై ట్విట్టర్ వేదికగా విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది.
ఇలాంటి సిల్లీ కామెంట్స్ని తాను పట్టించుకోనని హరీష్శంకర్ స్పష్టం చేయడంతో దీనికిపై కూడా కాంట్రవర్శీ మొదలైంది. అంతా కామ్గా వున్న వేళ ఇద్దరి మధ్యలో మరో నిర్మాత దూరడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయనే పీవీపీ. ఇటీవల దిల్ రాజు, అశ్వనీదత్తో కలిసి మహేష్తో `మహర్షి` చిత్రాన్ని నిర్మించిన పీవీపీ తాజాగా సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ని విమర్శిస్తూ హరీష్శంకర్ని సపోర్ట్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది.
`పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడను బ్రహ్మాండంగా చెప్పావు హరీష్శంకర్. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట…. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు, నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి వేయిటింగ్` అంటూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. పీవీపీ ట్వీట్పై బండ్ల గణేష్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.