నటుడు, నిర్మాత బండ్లగణేష్కు ఓ స్టార్ డైరెక్టర్కు మధ్య వివాదం ముదురుతోందా? అంటే సెఓషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్వీట్ల వరస చూస్తే నిజమే అనిపిస్తోంది. `తింటున్నంత సేపు `ఇస్తరాకు` అంటారు.. తిన్నాక ఎంగిలాకు అంటారు.. అంటే నీతో అవసరం వున్నంత సేపు వరుసలు కలిపి మాట్లాడతారు. అవసరం తీరాక లేనిపోని మాటలు అంటగడతారు` అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ టాలీవుడ్లో వైరల్గా మారింది.
ఇటీవల బండ్ల గణేష్ నిర్మించిన `గబ్బర్సింగ్` చిత్రం విడుదలై 8 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. పవన్కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్టర్ వేదికగా సినిమాపై ఓ లేఖని షేర్ చేశారు. అందులో నిర్మాత బండ్ల గణేష్ పేరుని ప్రస్థావించడం మరిచారు. ఇదే వివాదానికి కారణంగా మారినట్టు తెలిసింది.
ఆ కారణంగానే బండ్ల గణేష్ వరుస ట్వీట్లు చేస్తున్నారని, సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తూ తన దైన శైలిలో స్పందించారు. అయితే తాజాగా పెట్టిన పోస్ట్ మరింత వైరల్గా మారడం చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై బండ్ల గణేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.