హరీష్శంకర్ కేవలం రీమేక్ చిత్రాల్ని మాత్రమే తెరకెక్కించగలడు కానీ స్ట్రెయిట్ ఫిల్మ్స్ని అంతాగా ఆ కట్టుకునే స్థాయిలో చేయలేడు అని ఇటీవల ఓ నిర్మాత వివాదాస్పద కామెంట్లు చేసినట్టు ప్రచారం జరిగింది. ఇండస్ట్రీలో దీనిపై గుస గుసలు కూడా వినిపించాయి. అయితే ఈ వార్తలపై దర్శకుడు హరీష్శంకర్ స్పందించారు.
మిరపకాయ్, డీజే, సుబ్రమణ్యం ఫర్ సేల్ రీమేక్లు కాదు. భారీ విజయాలని సాధించడమే కాకుండా అయినా భారీ వసూళ్లని రాబట్టాయి కూడా. అలాంటప్పుడు కొంత మంది చేసే వెర్రి వ్యాఖ్యల్ని నేనెందుకు పట్టించుకోవాలి. అయినా ఫ్రీమేక్ చేసుకోవడం కంటే రీమేక్ చేయడం గౌరవం కదా` అని హరీష్ శంకర్ వ్యాఖ్యానించారు.
హరీష్శంకర్ ప్రస్తుతం పవర్స్టార్ పవన్కల్యాణ్ కోసం టెర్రిఫిక్ స్టోరీని రెడీ చేసే పనిలో బిజీగా వున్నారు. `గబ్బర్సింగ్` వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మళ్లీ వీరిద్దరి కలయికలో మరో భారీ చిత్రం తెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్పై ఈ సినిమా సెట్స్పైకి రాబోతోంది. PSPK 28గా తెరపైకి రాబోతున్న ఈ చిత్రం కోసం ప్రస్తుతం హరీష్శంకర్ కథని సిద్ధం చేస్తున్నారు. దీనికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నారు.