Homeటాప్ స్టోరీస్మ‌ల‌యాళ హీరోకి క‌రోనా పాజిటివ్‌!

మ‌ల‌యాళ హీరోకి క‌రోనా పాజిటివ్‌!

మ‌ల‌యాళ హీరోకి క‌రోనా పాజిటివ్‌!
మ‌ల‌యాళ హీరోకి క‌రోనా పాజిటివ్‌!

లాక్‌డౌన్ టైమ్‌లో జోర్దాన్‌లో చిక్కుకున్న మ‌ల‌యాళ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌. `ఆడు జీవితం` మూవీ కోసం 58 మంది టీమ్‌తో జోర్దాన్ వెళ్లాడు. అక్క‌డ కొంత షూటింగ్ జ‌రిగిన త‌రువాత క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌బల‌డంతో వ‌ర‌ల్డ్ వైడ్‌గా లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చిన విష‌యం తుఎలిసిందే. ఆ స‌మ‌యంలో పృథ్వీరాజ్ త‌న 58 మంది టీమ్‌తో జోర్డాన్‌లోనే లాక్ అయిపోయారు.

రెండు నెల‌ల నిరీక్ష‌ణ త‌రువాత టీమ్ అంతా మ‌ళ్లీ క్షేమంగా ఇండియా తిరిగి వ‌చ్చింది విశేషం ఏంటంటే ఇలా ఇండియా తిరిగి వ‌చ్చిన టీమ్‌లో కొంత మందికి మాత్ర‌మే క‌రోనా సోకిన‌ట్టు తేలింది. హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ కు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేదు. దీంతో 14 రోజుల పాటు హోమ్ క్వారెంటైన్‌లో వున్న ఆయ‌న తిరిగి త‌న కొత్త చిత్రం `జ‌న గ‌ణ మ‌న‌` షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

- Advertisement -

తాజాగా ఆయ‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డిన‌ట్టు తెలిసింది. దీంతో టెస్ట్ చేయించుకోగా క‌రోనా పాజిటివ్ అని తేలింద‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. షూటింగ్ స్పాట్‌లో త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు సోకివుంటాయ‌ని పృథ్వీరాజ్ సుకుమార‌న్ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు. దీంతో ఆయ‌న క్వారెంటైన్‌కి వెళ్లిపోయారు. డాక్ల‌ర్ల సల‌హా మేర‌కు చికిత్స పొందుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All