వి.ఐ. ఆనంద్ రూపొందించిన చిత్రం `డిస్కోరాజా`. రవితేజ ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు కానీ ఆ అంచనాలన్నీ తలక్రిందులు చేసింది. కొత్త తరహా సినిమానే అయినా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఫలితంతో కొంత నిరుత్సాహానికి గురైన మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసగా రెండు మూడు ప్రాజెక్ట్లతో బిజీగా వున్నారు.
రమేష్వర్మ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ని ఓకే చేసిన రవితేజ అదే తరహాలో మరో చిత్రాన్ని కూడా ఓకే చేసినట్టు తెలిసింది. ఇదిలా వుంటే మలయాళ రీమేక్పై రవితేజ కన్నేశారని తెలిసింది. పృథ్వీరాజ్ సుకుమారన్, బీజూ బీనన్ ల కలయికలో రూపొందిన మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్ కోశియుమ్`. ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కుల్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సొంతం చేసుకున్నారు.
ఈ రీమేక్లో రానా, బాలకృష్ణ నటిస్తారనిగత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్లో మాస్ మహారాజా రవితేజ నటించనున్నట్టు తెలిసింది. సుధీర్వర్మ దర్శకత్వం వహించనున్నాడట. సురేష్ ప్రొడక్షన్స్ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగస్వామి కాబోతోంది. ప్రస్తుతం సురేష్బాబు పర్యవేక్షణలో స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిసింది.