మోహన్లాల్, పృధ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `లూసీఫర్`. మలయాళంలో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ చిత్రాన్నితెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించనున్న ఈ మూవీని ఎన్వీ ప్రసాద్ నిర్మించబోతున్నారు. మోహన్రాజా దర్శకత్వం వహించనున్న ఈ మూవీ త్వరలో ప్రారంభం కాబోతోంది.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీలో హీరో సత్యదేవ్ కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇక మంజు వారియర్ పోషించిన పాత్ర కోసం జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణిని మేకర్స్ సంప్రదించినట్టు తెలిసింది. `లూసీఫర్`లో మంజు వారియర్ పాత్ర చాలా కీలకం అన్న విషయం తెలిసిందే. ఆ పాత్ర కోసం ప్రియమణిని చిత్ర బృందం ఇటీవల సంప్రదించినట్టు తెలిసింది.
సినిమాలో మంజు వారియర్ హీరో మోహన్లాల్కు చెల్లెలుగా నటించింది. ఇప్పుడు అదే పాత్ర కోసం ప్రియమణిని ఈ రీమేక్లో మెగాస్టార్కు చెల్లెలుగా నటించమని కోరుతున్నారట. ప్రియమణి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నటిస్తున్న `అసురన్` రీమేక్ `నారప్ప`లో నటిస్తోంది.