నటి ప్రియా రామన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టాలని భావిస్తోంది . గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ స్వతహాగా మలయాళీ అయినప్పటికీ చెన్నై ఓ స్థిరపడింది . తెలుగు , తమిళ , మలయాళ బాషలలో నటించిన ప్రియరామన్ పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేసుకుంటోంది . అయితే సడెన్ గా ఈ భామకు రాజకీయాలపై గాలి మళ్లింది .
దాంతో భారతీయ జనతా పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది . మరో విశేషం ఏంటంటే స్వరాష్ట్రమైన కేరళ లో కాకుండా స్థిరపడిన తమిళనాడులో కాకుండా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేయాలనీ చూస్తోంది . బీజేపీ లో చేరి ఎపి రాజకీయాలపై దృష్టి పెట్టె ఆలోచన చేస్తోంది ప్రియరామన్ .
- Advertisement -