టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్రాజు. కెరీర్లో అత్యధిక విజయాల్ని సొంతం చేసుకున్న ఆయన ఈ ఏడాది తన చిరకాల కోరికని నెరవేర్చుకుంటున్నారు. పవర్స్టార్ పవన్కల్యాణ్తో సినిమా చేయాలని గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న ఆయన తాజాగా `పింక్` రీమేక్ ఆధారంగా తెరకెక్కుతున్న `వకీల్సాబ్` చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో వుంది.
ఇదిలా వుంటే పవన్ తరహాలోనే ప్రభాస్తో భారీ చిత్రాన్ని చేయాలని దిల్ రాజు భావిస్తున్నారట. ఇప్పటికే ప్రభాస్కు సరిపడే కథల్ని ఆయనకు వినిపించారని తెలిసింది. అయితే వేణు శ్రీరామ్ చెప్పిన కథ ప్రభాస్కి నచ్చినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లు ఆగిపోవడంతో ఆ కోవలోనే వేన/ శ్రీరామ్ తెరకెక్కిస్తున్న `వకీల్సాబ్` చిత్రీకరణ కూడా నిలిచిపోయింది. ఈ సమయాన్ని ప్రభాస్ కు నచ్చిన స్క్రిప్ట్కి కేటాయిస్తున్నారట వేణు శ్రీరామ్.
ప్రభాస్తో గతంలో దిల్రాజు `మిస్టర్ పర్ఫెక్ట్` చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని చేస్తున్న ప్రభాస్ ఈ మూవీ తరువాత నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్న సోషియో ఫాంటసీ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే.