పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తోన్న మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ గత వారమే షూటింగ్ ను మొదలుపెట్టాల్సి ఉంది కానీ అనుకోని కారణాల కారణంగా ఇంకా మొదలుకాలేదు. దానికి కారణాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మురెళ్ళ ఈ చిత్రం నుండి వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది.
సాధారణంగా చాలా సాఫ్ట్ నేచర్ అయిన ప్రసాద్ మురెళ్ళ పవన్ కళ్యాణ్ తో గతంలో అత్తారింటికి దారేది, కాటంరాయుడు చిత్రాలకు పనిచేసాడు. అయితే నిర్మాతలతో జరిగిన వివాదం కారణంగానే పనిచేయట్లేదని సమాచారం. ఆయన స్థానంలో వేరే సినిమాటోగ్రాఫర్ ను తీసుకోవడానికి ఈ ఆలస్యం అయింది.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఐశ్వర్య రాజేష్, నిత్యా మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే విడుదల కానుంది.