యంగ్ రెబల్ స్టానర్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం `సలార్`. `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ప్రత్యర్థి వర్గం నుంచి తన వాళ్లని కాపాడుకునే ధీరోదాత్తుడైన హీరో కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో `కేజీఎఫ్` తరహాలో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ మూవీ ఈ నెల 15న లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం గోదావరిఖనిలో మొదలైనట్టు తెలిసింది. ఇందు కోసం గోదావరిఖని సమీపంలోరి రామగుండం చేరుకున్న చిత్ర బృందం, హీరో ప్రభాస్ అక్కడి పోలీస్ అధికారిరిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారితో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.
దీనికి సంబంధించిన ఫొటోలు, ప్రభాస్ కాన్వాయ్కి సంబంధించిన వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. గోదావరిఖనిలోని బొగ్గుగనిలో హీరో ప్రభాస్, శృతిహాసన్లపై కీలక ఘట్టాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించినట్టు తెలిసింది. గోదావరిఖనిలో టీమ్ సందడి చేసిన ఆన్ లొకేషన్ షూట్ ఫొటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.