Homeటాప్ స్టోరీస్ప్ర‌భాస్ 21 నుంచి ఒకే సారి టు అప్‌డేట్స్‌!

ప్ర‌భాస్ 21 నుంచి ఒకే సారి టు అప్‌డేట్స్‌!

ప్ర‌భాస్ 21 నుంచి ఒకే సారి టు అప్‌డేట్స్‌!
ప్ర‌భాస్ 21 నుంచి ఒకే సారి టు అప్‌డేట్స్‌!

ప్ర‌భాస్ వ‌రుస‌గా పాన్ ఇండియా స్థాయి చిత్రాల్ని ప్ర‌క‌టిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ప్ర‌స్తుతం మూడు భారీ చిత్రాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. `రాధేశ్యామ్‌` చిత్రంలో న‌టిస్తున్న ప్ర‌భాస్ మ‌రో మూడు భారీ చిత్రాల్లో న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. ఇందులో `స‌లార్‌`, ఆదిపురుష్ తో పాటు నాగ్ అశ్విన్ తెర‌కెక్కించ‌నున్న మూవీ కూడా వుంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

దీపికా ప‌దుకునే హీరోయిన్‌గా, అబితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌బోతున్నారు. సైంటిఫిక్ ఫిక్ష‌న్‌గా త్వ‌ర‌లో తెర‌పైకి రానున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ని శుక్రావారం చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

- Advertisement -

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి `మ‌హాన‌టి` టెక్నీషియ‌న్స్‌ని రిపీట్ చేస్తున్నారు. ఇదే విష‌యాన్ని చిత్ర బృందంతో పాటు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ వెల్ల‌డించారు. `మ‌హాన‌టి` చిత్రానికి హాలీవుడ్ కెమెరామెన్ డానీ సాంచెజ్ లోపెజ్, మిక్కీ జే మేయ‌ర్ .. ప్ర‌భాస్ చిత్రానికి ప‌నిచేయ‌బోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లోకి వీరికి వెల్క‌మ్ చెబుతూ చిత్ర బృందం, ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All