`సాహో` తరువాత హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రంపై ప్రేక్షకులు, ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. యువీ క్రియేషన్స్తో కలిసి గోపీ కృష్ణా మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. `జిల్` ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పిరియాడిక్ లవ్స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇది.
ఈ మూవీ ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూసిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ కోసం నిర్మాణ సంస్థలపై సోషల్ మీడియా వేదికగా చిన్న పాటి యుద్ధమే చేశారు కూడా. తాజాగా వీరి ఎదురుచూపులకు తెరపడింది. ఈ శుక్రవారం ఉదయం ఈ చిత్రానికి ప్రచారంలో వున్న `రాధేశ్యామ్` టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు.
చాలా రోజులుగా మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నమంటూ ఎప్పటికప్పుడు ఫస్ట్ లుక్ని వాయిదా వేస్తూ వచ్చిన మేకర్స్పై సర్వత్రా మూవీ లవర్స్ విమర్శలు కురిపిస్తున్నారు. ఇన్ని నెలలు టైమ్ తీసుకుని కూడా మేకర్స్ ఫస్ట్ లుక్ని ఇన్నోవేటివ్గా ప్లాన్ చేయలేకపోయారని, ఇటీవల వచ్చిన సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్లని కాపీ చేశారని విమర్శిస్తున్నారు. పూజా హెగ్డే, ప్రభాస్ కలిసి వున్న ఫస్ట్ లుక్ వరుణ్తేజ్ కంచె, సంజయ్ లీలా భన్సాలీ `రామ్ లీలా`, దర్శకుడు శంకర్ రూపొందించిన `ఐ` చిత్రాల ఫస్ట్ లుక్ని పోలి వుందని, `రాధేశ్యామ్` ఫస్ట్ లుక్ విషయంలో మేకర్స్ మరింత కొత్తగా ఆలోచించి వుండాల్సిందని సినీ లవర్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.