యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ని `బాహుబలి` మలుపు తిప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ మూవీ తరువాత చేసిన `సాహో` కూడా పాన్ ఇండియా స్థాయిలో వుండటం, దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లని సాధించడం తెలిసిందే. ఈ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా భారీ స్థాయిలో `జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. కరోరా ఉదృతం అవుతున్న వేళ ఈ చిత్ర బృందం జార్జియాలో సాహసోపేతంగా కీలక ఘట్టాల్ని పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వచ్చింది. అప్పటి నుంచి ప్రభాస్ అభిమానులు ఈ మూవీ ఫస్ట్ లుక్ కోసం సోషల్ మీడియా వేదికగా చిన్న పాటి యుద్ధమే చేస్తున్నారు.
తాజాగా వారి ఎదురుచూపులు ఫలించాయి. ఈ నెల 10న ఈ చిత్ర ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయబోతున్నట్టు హీరో ప్రభాస్, చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి `రాధేశ్యామ్` అనే టైటిల్ని ఫైనల్ చేశారని, అదే టైటిల్ని, ప్రభాస్ లుక్ని ఈ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
The announcement you all have been waiting for! Title & first look of #Prabhas20 will be out on 10.7.2020 at 10 AM?#Prabhas @hegdepooja @director_radhaa @UVKrishnamRaju garu @itsBhushanKumar #Vamshi #Pramod @PraseedhaU @UV_Creations @TSeries pic.twitter.com/64e4maW9us
— UV Creations (@UV_Creations) July 8, 2020