రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో మారిందో మనందరం చూసాం. బాహుబలి తర్వాత ఇండియా వ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న ప్రభాస్, సాహో చిత్రంతో నార్త్ లో తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక సాహో తర్వాత నుండి ప్రభాస్ అన్నీ ప్యాన్ ఇండియా చిత్రాలే చేస్తున్నాడు. రాధే శ్యామ్ షూటింగ్ పూర్తయింది. వచ్చే సంక్రాంతికి విడుదలవుతుంది.
సలార్, ఆది పురుష్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రెండు చిత్రాలను ఈ ఏడాదే పూర్తి చేయనున్నాడు ప్రభాస్. తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ చిత్రం ప్రాజెక్ట్ కె ఉండనే ఉంది. వీటితో 24 చిత్రాలను పూర్తి చేస్తాడు. తన ల్యాండ్ మార్క్ 25వ చిత్రం కోసం స్పెషల్ ఎరెంజ్మెంట్స్ జరుగుతున్నాయి.
ఇప్పటికే ప్రాజెక్ట్ కూడా సెట్ అయిందని తెలుస్తోంది. అక్టోబర్ 7న ఈ భారీ ప్రాజెక్ట్ గురించిన అనౌన్స్మెంట్ ను స్వయంగా ప్రభాస్ తన ఫేస్ బుక్ లో ఇస్తాడని రివీల్ అయింది. ఈ ప్రాజెక్ట్ ను ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు, ఏ రేంజ్ అనౌన్స్మెంట్ అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.