పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటలీ వీధుల్లో హంగామా చేస్తున్నారు. అక్కడి ఫ్యాన్స్తో ఫొటోలకి పోజులిస్తూ సందడి చేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. యువీ క్రియేషన్స్ , టి సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
ఇటీవలే ఈ చిత్ర బందం ఇటలీ వెళ్లింది. లాక్డౌన్ బిఫోర్ అక్కడే కొన్ని కీలక సన్నివేశాల్ని షూట్ చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్ని మధ్యలోనే చిత్రీకరించడం ఆపేసి టీమ్ ఇండియా తిరిగి వచ్చేసింది. తాజాగా అన్లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఇటీవలే టీమ్ ఇటలీ వెళ్లింది. తాజాగా బ్యాలెన్స్ సీన్లని పూర్తి చేశారు.
షూటింగ్ పూర్తి కావడంతో ప్రభాస్ ఇటలీలోని టురిన్ సిటీ వీధుల్లో విహరిస్తూ హల్చల్ చేస్తున్నారు. ఓ జాగర్స్తో కలిసి ఫొటోలకు పోజులిచ్చిన ప్రభాస్ బ్రేక్ టైమ్ని ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా భయాన్ని పక్కన పెట్టి టురిన్ సిటీ వీధుల్లో సందడి చేస్తున్నారు. వచ్చే వారం ప్రభాస్ అండ్ టీమ్ హైదరాబాద్ రాబోతోంది. మిగతా షూటింగ్ని ఇక్కడ ప్రారంభించాలనుకుంటున్నారు. ఇందు కోసం భారీ సెట్ని సిద్ధం చేశారు.