Homeటాప్ స్టోరీస్యువీకి మ‌రో సినిమా సైన్ చేశారు!

యువీకి మ‌రో సినిమా సైన్ చేశారు!

యువీకి మ‌రో సినిమా సైన్ చేశారు!
యువీకి మ‌రో సినిమా సైన్ చేశారు!

`బాహుబ‌లి` వంటి చారిత్రాత్మ‌క విజ‌యం త‌రువాత ప్ర‌భాస్ స్థాయి, స్టార్‌డ‌మ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆ స్థాయికి త‌గ్గ‌ట్టే సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారాయ‌న‌. `బాహుబ‌లి` త‌రువాత పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయిన చిత్రం `సాహో`. సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మించింది. ఈ మూవీ త‌రువాత కూడా ప్ర‌భాస్ త‌న త‌దుపరి చిత్రాన్ని యువీలోనే చేస్తున్నారు.

యువీ సంస్థ ప్ర‌భాస్‌కు హోమ్ బ్యాన‌ర్ లాంటిది. స్నేహితుడు కృష్ణారెడ్డి, సోద‌రుడు ప్ర‌మోద్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ బ్యాన‌ర్‌లో రాధాకృష్ణ‌కుమార్ తెర‌కెక్కిస్తున్న `రాధేశ్యామ్‌` చిత్రంలో ప్ర‌భాస్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కీల‌క ఘ‌ట్టాల‌ని ఇటీవ‌లే జార్జియాలో పూర్తి చేశారు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌రువాత మ‌ళ్లీ ఈ చిత్ర షూటింగ్‌ని హైద‌రాబాద్‌లో మొద‌లుపెట్టాల‌ని భావిస్తున్నారు.

- Advertisement -

ఇదిలా వుంటే ఇదే సంస్థ‌కు ప్ర‌భాస్ మ‌రో చిత్రాన్ని కమిట్ అయ్యార‌ట‌. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సి. అశ్వ‌నీద‌త్ నిర్మించ‌నున్న చిత్రాన్ని ఓకే చేసిన ప్ర‌భాస్ ఆ మూవీ త‌రువాత యువీ క్రియేష‌న్స్‌కు మ‌రో సినిమా చేనున్నాడ‌ట‌. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని, భారీ స్పాన్‌లో ఈ చిత్రం వుండ‌నుంద‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All