`బాహుబలి`, సాహో చిత్రాలతో హీరో ప్రభాస్ స్థాయి మారిపోయింది. మార్కెట్ కూడా ఎల్లలు దాటేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న 20వ చిత్రంపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. `జిల్` ఫేమ్ ఆర్. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
యువీ క్రియేషన్స్, గోపీ కృష్ణా మూవీస్ బ్యానర్స్పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి, `మైనే ప్యార్ కియా` ఫేమ్ భాగ్యశ్రీ ఈ చిత్రంలో ప్రభాస్కు తల్లిగా నటిస్తోంది. కరోనా భారత్లో వ్యాప్తి కావడానికి ముందు జార్జియా వెళ్లి ఈ చిత్ర బృందం పలు కీలక సన్నివేశాల్ని పూర్తి చేసుకుని వచ్చింది. అప్పటి నుంచి క్వారెంటైన్ కు పరిమితమైన టీమ్.. త్వరలో మళ్లీ షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.
ఇందు కోసం ఓ భారీ హాస్పిటల్ సెట్ని సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. నాలుగు అంతస్థులతో దాదాపు 5 కోట్ల భారీ వ్యయంతో ఈ సెట్ని నిర్మిస్తున్నారట. ఈ సెట్లో నెల రోజుల పాటు షూటింగ్ చేయనున్నారని తెలిసింది. ఆగస్టు నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని ఇన్సైడ్ టాక్. ప్రభాస్ రెండు గెటప్లలో కనిపించనున్న ఈ చిత్రానికి `రాధేశ్యామ్` అనే టైటిల్ని ఫైనల్ చేశారట. త్వరలోనే ఫస్ట్లుక్తో పాటు టైటిల్ని కూడా విడుదల చేయనున్నట్టు తెలిసింది.