Homeగాసిప్స్`బాహుబ‌లి` త‌ర‌హాలో `ఇండియ‌న్ -2`..?

`బాహుబ‌లి` త‌ర‌హాలో `ఇండియ‌న్ -2`..?

`బాహుబ‌లి` త‌ర‌హాలో `ఇండియ‌న్ -2`..?
`బాహుబ‌లి` త‌ర‌హాలో `ఇండియ‌న్ -2`..?

రాజ‌మౌళి తెర‌కెక్కించిన `బాహుబ‌లి` రెండు భాగాలుగా తెర‌కెక్కి సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాల‌కు చాటిన ఈ సినిమా భారతీయ సినీ జ‌గ‌త్తులో స‌రికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ సినిమా ఫార్మాట్‌నే ద‌ర్శ‌కుడు శంక‌ర్ అనుస‌రించ‌బోతున్నారు. క‌మ‌ల్‌హాస‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించి `ఇండియ‌న్‌` ఏ స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికి తెలిసిందే.

తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా `ఇండియ‌న్ – 2` చిత్రం తెర‌కెక్కుతోంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అల్లిరాజా సుభాస్క‌ర‌న్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్ధ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. క‌రోనా ప్ర‌భావం ప్రారంభానికి ముందు చెన్నైలోని ఓ స్టూడియోలో షూటింగ్ చేస్తుండ‌గా క్రేన్ విరిగిప‌డి ముగ్గురు సిబ్బంది మృతి చెందిన విష‌యం తెలిసిందే.

- Advertisement -

దీంతో ఈ చిత్ర షూటింగ్‌ని నిర‌వ‌దికంగా వాయిదా వేశారు. మ‌ళ్లీ ప్రారంభించాల‌నుకున్న స‌మ‌యంలో క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆడిపోయింది. అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెర‌కెక్కించాల‌ని శంక‌ర్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. తొలి పార్ట్‌ని వ‌చ్చే ఏడాది రిలీజ్ చేసి ఆ త‌రువాత రెండ‌వ భాగాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ఆలోచ‌న‌లో వున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All