![కమల్, శంకర్లకు చెన్నై పోలీస్ల సమన్లు! కమల్, శంకర్లకు చెన్నై పోలీస్ల సమన్లు!](https://telugu.tollywood.net/wp-content/uploads/2020/02/Chennai-police-sends-summons-to-Indian-2-Team.jpg)
శంకర్ తెరకెక్కిస్తున్న `ఇండియన్ 2` సినిమా సెట్ లో దారుణమైన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన క్రేజ్ కూలిపోవడంతో దాని కారణంగా చంద్ర, కృష్ణ, మధు అనే ముగ్గురు టెక్నీషియన్స్ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో టీమ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ప్రమాదంలో శంకర్ కు కూడా గాయాలయ్యాయని, అయితే టీమ్ మాత్రం ఆ విషయాన్ని దాస్తోందని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా వుండగా ప్రమాదంపై సీనియస్ అయిన చెన్నై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తోంది. క్రేన్ యజమాని, ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్లతో పాటు లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్, హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ లకు సమన్లు జారీ చేసినట్టు తెలిసింది.
ఈ దారుణ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు కమల్హాసన్ గురువారం కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. పైగా ఇండస్ట్రీలో పనిచేసే వారి జీవితాలకు రక్షణ లేదని, కోట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తున్నా కార్మికుల రక్షణకు మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని, ఈ విషయంలో వ్యక్తిగతంగా సిగ్గుపడుతున్నానని కమల్ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.