దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విలయాతాండవం చేస్తోంది. ఎక్కడ చూసినా కోవిడ్ కేసులే. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,14,835 కేసులు నమోదు కావడం డెత్ బెల్స్ మోగిస్తోంది. ఇదిలా వుంటే సెలబ్రిటీల్లోనూ కోవిడ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వరుసగా సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు.
ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అల్లు అరవింద్, విజయేంద్ర ప్రసాద్, నివేదా థామస్, అనిల్ రావిపూడి, పవన్కల్యాణ్, బండ్ల గణేష్ ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడ్డారు. ఇందు కొంత మంది ఇప్పటికే కోలుకున్నారు. కొంత మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా కోవిడ్ అనుమానంతో స్వీయ నిర్భంధంలోక వెళ్లడం ఆయన అభిమానుల్ని కలవరానికి గురిచేస్తోంది.
గత కొన్నపి రోజులుగా రాధేశ్యామ్, సలార్, ఆది పురుష్ చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా ఆయనకి అత్యంత సన్నిహితంగా వుండే టీమ్ మెంబర్స్కి కోవిడ్ సోకినట్టు తెలిసింది. దీంతో ప్రభాస్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. ప్రభాస్ స్వీయనిర్భఃధంలోకి వెళ్లడంతో తను నటిస్తున్న రాధేశ్యామ్, సలార్, ఆది పురుష్ చిత్రాల షూటింగ్లకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.