Homeటాప్ స్టోరీస్`ఆదిపురుష్‌` కోసం అప్పుడే ప‌ని మొద‌లుపెట్టారు!

`ఆదిపురుష్‌` కోసం అప్పుడే ప‌ని మొద‌లుపెట్టారు!

`ఆదిపురుష్‌` కోసం అప్పుడే ప‌ని మొద‌లుపెట్టారు!
`ఆదిపురుష్‌` కోసం అప్పుడే ప‌ని మొద‌లుపెట్టారు!

పాన్‌ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం `రాధేశ్యామ్‌`. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఆ వెంట‌నే ప్ర‌భాస్ రెండు భారీ చిత్రాల‌ని ప్రారంభించేస్తున్నారు. అందులో ప్ర‌ధానంగా వినిపిస్తున్న పేరు `ఆది పురుష్‌`. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని 3డీ ఫార్మాట్‌లో అత్యంత భారీ సాంకేతికతో తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

బాలీవుడ్ భారీ చిత్రాల నిర్మాణ సంస్థ టి సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంది. రామాయ‌ణ ఇతివృత్తాన్ని నేప‌థ్యంగా తీసుకుని స‌రికొత్తగా సాంకేతిక‌త‌ని జోడించి ఈ మూవీని `అవ‌తార్‌` రేంజ్‌లో తెర‌పైకి తీసుకురావాల‌ని ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. మైథ‌లాజిక‌ల్ చిత్రం కావ‌డంతో ఈ చిత్రానికి గ్రాఫిక్స్ ప్ర‌ధాన హైలైట్‌గా నిల‌వ‌నున్నాయ‌ట‌. ఇందు కోసం ఏకంగా ఏడాది పాటు గ్రాఫిక్స్ వ‌ర్క్ కోస‌మే కేటాయించ‌బోతున్నార‌ట‌.

- Advertisement -

మూడు నెల‌ల్లో చిత్రాన్ని పూర్తి చేసి గ్రాఫిక్స్ కోసం ఏడాది పాటు శ్ర‌మించనున్న‌ట్టు తెలిసింది. ఇందు కోసం హాలీవుడ్ చిత్రాల స్థాయిలో బ‌డ్జెట్‌ని కూడా ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు తెలిసింది. హాలీవుడ్‌కు చెందిన రెండు ప్ర‌ముఖ గ్రాఫిక్స్ సంస్థలు ఇటీవ‌ల ఈ చిత్రం కోసం వ‌ర్క్ ప్రారంభించిన‌ట్టు బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఇందులో అవ‌తార్ త‌ర‌హాలో ప్ర‌భాస్ నీలివ‌ర్ణంలో క‌నిపించ‌నున్నార‌ట‌. ఇందు కోసం భారీ స్థాయిలో గ్రాఫిక్స్‌ని వాడ‌బోతున్నార‌ని ఇండియ‌న్ స్క్రీన్‌పై న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న స్థాయిలో ఈ మూవీ గ్రాఫిక్స్ వుండ‌నున్నాయ‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All