చేతిలో సరైన సినిమాలు లేకపోయినా తరచూ వార్తల్లో నిలుస్తోంది పూనమ్ కౌర్. సోషల్ మీడియా వేదికగ ఆసక్తికర ట్వీట్లతో వార్తల్లో నిలుస్తున్న పూనమ్కౌర్ ఆ మధ్య సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రియంచడం అప్పట్లో సంచలనం సృష్టించింది. మీటూ వివాదంపై కూడా స్పందించి ఇండైరెక్ట్గా కొంత మందిని ఇబ్బంది పెట్టిన పూనమ్ తాజాగా చేసిన ట్వీట్ మరోసారి వైరల్గా మారింది.
ఓ అబద్దాల కోరు రాజకీయ నాయకుడు కాగలడు కానీ లీడర్ కాలేడంటూ వివాదాస్పద ట్వీట్ చేసి అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. తాజాగా మళ్లీ అలాంటి ట్వీట్ వేసి మరోసారి వార్తల్లో నిలిచింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేస్తోంది. దీని కారణంగా మానవాళి ఇబ్బందుల్లో పడింది. జనం బయటికి రావాలంటే మాస్క్ తప్పనిసరి అయింది. దీంతో రక రకాల మాస్కులకు గిరాకీ ఏర్పడింది. దీంతో చాలా మంది తమకు నచ్చిన వారికి మాస్క్లని పంపిపెట్టడం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తున్నారు.
పూనమ్కౌర్ కూడా మాస్కులకు ఆర్డర్ ఇచ్చేసింది. తాజాగా షాంపిల్ మాస్కులు రావడంతో వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. షాకింగ్ న్యూస్ ఏంటంటే పూనమ్ ఆర్డర్ చేసిన మాస్కులపై `పీకే లవ్` అని వుండటం. పీకే అంటే పవన్కల్యాణ్ అని అందరికి తెలిసిందే. అయితే తను మాత్రం పీకే అంటే పూనమ్కౌర్ అంటోంది. కొంత మంది ప్రేమకోసం నా సిగ్నేచర్ ను చేశారు. నాకు నచ్చిన వారి కోసం కస్టమైజ్ మాస్కులు ఆర్డర్ ఇచ్చాను. అవి నాకు నచ్చాయి. డబ్ల్యూ హెచ్వో మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మాస్కులు వున్నాయి` అని ట్వీట్ చేసింది పూనమ్.