శ్రీకాంత్ నటించిన `మాయాజాలం` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది పూనమ్ కౌర్. తేజ రూఐపొందించిన `ఒక విచిత్రం`, సాయి కిరణ్ అడివి `వినాయకుడు` వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే ఆ స్థాయిలో మాత్రం అవకాశాల్ని దక్కించుకోలేకపోయింది. హీరోయిన్గా రాణించగలిగే గ్లామర్ వున్నా ఎందుకో ఆ స్థాయిలో క్రేజ్ని సొంతం చేసుకోలేకపోయింది.
గత కొంత కాలంగా సోషల్ మీడియా ద్వారా వార్తల్లో నిలుస్తోంది. రెండు బెత్తం దెబ్బలు ఆయనకి కూడా అంటూ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచింది. అప్పట్లో పవన్కల్యాణ్, త్రివిక్రమ్ల కాంబినేషన్లో తెరకెక్కిన `జల్సా`లో పూనమ్ కౌర్ నటిస్తుందనే వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తల్ని అప్పట్లో లైట్ తీసుకున్న ఆమె తాజాగా స్పందించింది.
`ఎన్నికల సమయంలో నా గురించి చాలా పుకార్లు వినిపించాయి. `జల్సా` చిత్రంలో అవకాశం దక్కలేదనే కారణంతో నేను ఆవేదనకు గురైనట్టు ప్రచారం జరిగింది. అవన్నీ తప్పుడు వార్తలు. ఒక్క దాసరి గారి దర్శకత్వంలో తప్ప మరే దర్శకుడితోనూ తాను పనిచేయాలని కలలు కనేదని పూనమ్ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.