రెబెల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ లవ్ స్టోరీ రాధే శ్యామ్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ గత కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే.
ఇదిలా ఉంటే రాధే శ్యామ్ గురించి ఆసక్తికర సంగతులు చెప్పింది పూజ. అలాగే ఈ చిత్ర షూటింగ్ స్టేటస్ గురించి కూడా రివీల్ చేసింది. “మరో 7 నుండి 10 రోజుల పాటు షూటింగ్ చేస్తే రాధే శ్యామ్ పూర్తవుతుంది. త్వరలోనే లాస్ట్ షెడ్యూల్ మొదలవుతుంది. నాకు తెలుసు ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. కానీ ఇది అందరికీ నచ్చుతుంది. ప్రభాస్ రొమాంటిక్ స్టోరీలో నటించడం కొత్తగా అనిపిస్తుంది. అలాగే నేను కూడా లవ్ స్టోరీ చేసి చాలా కాలమైంది” అని పూజ హెగ్డే తెలిపింది.
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాను రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.