ఎన్నికల ఫలితాలు కోసం నరాలు తెగేలా ఎదురు చేస్తున్నారు ప్రజలు , నాయకులు , కార్యకర్తలు . ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి పీఠం కోసం చంద్రబాబు నాయుడు– జగన్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది . అలాగే దేశ ప్రధాని పదవి కోసం నరేంద్ర మోడీ – రాహుల్ గాంధీ ల మధ్య పోటీ ఉత్కంఠ ని రేపుతోంది . అయితే మరికొద్ది సేపట్లోనే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది . కానీ ఫలితాలు రావడం మాత్రం ఈసారి ఆలస్యం అయ్యేలా ఉంది .
ఎందుకంటే ఎలక్ట్రానిక్ మిషన్ల తోనే కౌంటింగ్ అయినప్పటికీ వివి ఫ్యాట్ ల లెక్కింపు తర్వాత మాత్రమే తుది ఫలితాన్ని ప్రకటించనున్నారు . అలాగే వివి ప్యాట్ ల మధ్య ఎలక్ట్రానిక్ మిషన్ ల మధ్య తేడా వస్తే మరింతగా ఆలస్యం కానుంది ఫలితం దాంతో అందరిలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది . ఇక బెట్టింగ్ లైతే కోట్ల లో చేస్తున్నారు . మా నాయకుడు అంటే లేదు మా నాయకుడే అంటూ నినాదాలు చేస్తూ హిరెత్తిస్తున్నారు . పరిస్థితి చూస్తుంటే పెద్ద ఎత్తున గొడవలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ లో .