లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అకాల మరణం ఆయన కుటుంబానికే కాక యావత్ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయయ మృతి పట్ల పలువురు రాజకీయ సినీ రంగ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భీతావాహ వాతావరణం అలుముకున్న దశలో బాలు అంత్యక్రయలు చెన్నై శివారులోని బాలు వ్యవసాయ క్షేత్రంలో జరిగాయి.
అంత్యక్రియలకు కొంత మంది స్టార్స్ మాత్రమే హాజరయ్యారు. అందులో యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ కూడా పాల్గొన్నారు. అతి సాధారణ వ్యక్తిగా విజయ్ బాలు అంత్యక్రియలకు హాజరైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే బాలుని కడసారి చూపు కూడా చూడటానికి తమిళ హీరో అజిత్ ఎందుకు రాలేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై బాలు తనయుడు ఎస్పీచరణ్ స్పందించారు.
అజిత్ నాకు మంచి మిత్రుడు బహుషా అతను ఇంటి వద్దే తన సంతాపాన్ని వ్యక్తం చేసివుంటాడని అనుకుంటున్నాను. ఇటీవలే ఆయన ఫాదర్ చనిపోయారు. వున్న మదర్ని సురక్షితంగా వుంచుకోవాలనుకుంటున్నారు. ఒకరు బహిరంగంగా ఏడవకపోతే, వారు పట్టించుకోవడం లేదని దాని అర్థం కాదు. అతను నిజంగా తన తండ్రి పేరు మీద ఒక స్మారకాన్ని నిర్మించాలని ఆలోచిస్తున్నాడు మరియు అన్నిటికంటే తన తల్లి గురించి ఆందోళన చెందుతున్నాడు. అతను కోరినట్లుగా, అతను దుఃఖించడానికి అతని కుటుంబాన్ని విడిచిపెట్టడం ఉత్తమం` అని చరణ్ క్లారిటీ ఇచ్చారు.