మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం `ఆచార్య` చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా పవర్స్టార్ రామ్చరణ్, నిరంజన్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ 40 శాతం పూర్తయింది. మిగతా భాగం షూట్ చేయాలనుకుంటున్న సమయంలో కరోనా ప్రభావం మొదలయ్యేసరికి ఈ చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత మలయాళ హిట్ ఫిల్మ్ `లూసీఫర్` ఆధారంగా తెలుగులో ఓ చిత్రాన్ని చేయాలని ముందు ప్లాన్ చేసుకున్నారు. కానీ స్క్రిప్ట్ సంతృప్తిగా రాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేశారు.
ఇదే సినిమా ప్లేస్లో ఓ తమిళ చిత్రాన్ని రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అజిత్ హీరోగా `సిరుతై శివ` దర్శకత్వంలో వచ్చిన చిత్రం `వేదాలం`. ఈ చిత్రాన్నే మెగాస్టార్ రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్పై కె. ఎస్. రామారావు నిర్మిస్తారని ఓ పక్క ప్రచారం జరుగుతోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 14 ప్లస్ రీల్స్ తో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తారని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే బయటికి రానుందని చెబుతున్నారు. మెగాస్టార్ మాత్రం ఇంకా ఏ ప్రొడ్యూసర్కు కమిట్ కాలేదని, ఆయన ఎవరితో సినిమా అంటే ఆ ప్రొడ్యూసర్స్ లైన్ లోకి వస్తారని ఇండస్ట్రీ వర్గాల టాక్.