‘సైరా నరసింహా రెడ్డి’ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హీరో రామ్ చరణ్, నిరంజన్రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్తో 40 శాతం చిత్రీకరణ పూర్తియింది.
ఎండోమెంట్ అధికారిగా చిరంజీవి ఈ చిత్రంలో కనిపించబోతున్న ఈ చిత్రానికి `ఆచార్మ` అనే టైటిల్ని చిత్ర బృందం ఖరారు చేసిన విషయం తెలిసిందే. మరో కీలక అతిథి పాత్రలో హీరో మెగా పవర్స్టార్ రామ్ చరణ్ నటించనున్నారు. రామ్ చరణ్ `ఆర్ ఆర్ ఆర్`లో నటిస్తున్న సందర్భంగా `ఆచార్య` చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. కరోనా వైరస్ ప్రబలడంతో ఈ చిత్ర షూటింగ్ని నిరవధికంగా చిత్ర బృందం నిలిపివేసింది. త్వరలోనే షూటింగ్ని ప్రారంభించాలని, చిఒరుకు సంబంధించిన కీలక ఘట్టాలని పూర్తి చేయాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే ఆర్ ఎఫ్సీలో భారీ సెట్ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్రం నుంచి త్వరలోనే ఫస్ట్ లుక్ రాబోతోంది. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ని మేకర్స్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు.