తెలుగులో ప్రయాణం, ఊసరవెల్లి చిత్రాలతో గుర్తింపుని సొంతం చేసుకున్న పాయల్ ఘోష్ కొంత విరామం తరువాత మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కు మీరాచోప్రాకు మధ్య జరిగిన డర్టీ వార్ సమయంలో లైన్లోకి వచ్చిన పాయల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు ఎన్టీఆర్ని సపోర్ట్ చేస్తూ వరుస ట్వీట్లు చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా బాలీవుడ్లో డ్రగ్స్ కలకలం నేపథ్యంలో మళ్లీ తనదైన స్టైల్లో వరుస ట్వీట్లతో వైరల్గా మారింది.
అనురాగ్ కశ్యప్ తనని లైంగికంగా వేధించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పాయల్ అతనిపై ప్రధాని మోదీకి కంప్లైంట్ చేయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడం బాలీవుడ్లో కలకలం రేపింది. అయితే ఈ విషయంలో ఆమెనే తప్పుపడుతూ బాలీవుడ్ తారలు అనురాగ్కు మద్దతుగా నిలిచారు. తాప్సీ నుంచి వర్మతో పాటు అనురాగ్ మాజీ భార్యలు కూడా అనురాగ్నే సపోర్ట్ చేయడంతో పాయల్ కార్నర్ అయిపోయింది. దీన్ని గమనించిన పాయల్ తాజాగా చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. తను ఉరితాడుకి వేలాడి కనిపిస్తే అది ఆత్మ హత్య కాదని దేశం గుర్తించాలని తనని టార్గెట్ చేసిన వారికి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది.
తనని ఓ దర్శకుడు లైంగికంగా వేదించాడని ఓ పోర్టల్కి వెల్లడిస్తే తనకు అండగా నిలవాల్సిన వారంతా ఇప్పుడు తనని కార్నర్ చేస్తున్నారని, అనురాగ్కి మద్దతు తెలుపుతున్నారని వాపోయింది. ఈ సందర్భంగా తీవ్ర మనస్థాపానికి గురైన పాయల్ తను ఉరితాడుకు వేలాడుతూ కనిపిస్తే అది ఆత్మ హత్య కాదని దేశం గుర్తించాలని సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.