Homeటాప్ స్టోరీస్హైద‌రాబాద్ మెట్రోలో ప‌వ‌న్ హ‌ల్‌చ‌ల్‌!

హైద‌రాబాద్ మెట్రోలో ప‌వ‌న్ హ‌ల్‌చ‌ల్‌!

హైద‌రాబాద్ మెట్రోలో ప‌వ‌న్ హ‌ల్‌చ‌ల్‌!
హైద‌రాబాద్ మెట్రోలో ప‌వ‌న్ హ‌ల్‌చ‌ల్‌!

ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏడు నెల‌ల విరామం త‌రువాత బ‌య‌టికొచ్చారు. క‌రోనా కార‌ణంగా ఇంటి ప‌ట్టునే వున్న ఆయ‌న త‌న కొత్త చిత్రం `వ‌కీల్‌సాబ్‌` సెట్లోకి ఎంట‌ర‌య్యారు. ఇందులో భాగంగా ప‌వ‌న్ గురువారం మెట్రో ప్ర‌యాణికుల‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించారు. ఓ సాధార‌ణ పౌరుడిలా ఆయ‌న మెట్రో ట్రైన్ ఎక్క‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. మాదాపూర్ మెట్రో స్టేష‌న్‌లో ట్రైన్ ఎక్కిన ప‌వ‌న్ మియాపూర్ వ‌ర‌కు ప్ర‌యాణించారు.

ఆయ‌న క‌థానాయ‌కుడిగా నటిస్తున్న చిత్రం `వకీల్‌సాబ్‌`. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజుతో క‌లిసి బోనీక‌పూర్ నిర్మిస్తున్నారు. గ‌త ఏడు నెల‌లుగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇటీలే మొద‌లైంది. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ మియాపూర్‌లో జ‌రుగుతుండ‌గా అందు కోసం ప‌వ‌న్ మెట్రోలో మియాపూర్ వెళ్లిన‌ట్టు తెలిసింది. మాదాపూర్‌లో మెట్రో ఎక్కిన ప‌వ‌న్ ఆ త‌రువాత అమీర్‌పేట్‌లో ట్రైన్ మారారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా తోటి ప్ర‌యాణికుల‌తో సంభాషించారు. ద్రాక్షారాబం రైతు స‌త్య‌నారాయ‌ణ‌తో మాట్లాడి పంట‌లు.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల గ‌రించి అడిగి తెలుసుకున్నారు. వ‌ర్షాల కార‌ణంగా చాలా న‌ష్టాలొచ్చాయ‌ని రైతు ప‌వ‌న్‌కి వివ‌రించారు. త‌నకు మెగ్రో ప్ర‌యాణం ఇదే తొలిసారని చెప్ప‌గా న‌వ్విన ప‌వ‌న్ త‌న‌కూ ఇదే మొద‌టి సార‌ని చెప్పార‌ట‌. ప‌వ‌న్‌తో పాటు నిర్మాత దిల్‌రాజు కూడా మెట్రో ఎక్కారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All