లేటయినా సరే లేటెస్ట్గా వస్తామంటున్నారు `వకీల్సాబ్` టీమ్. వరల్డ్ మొత్తం కరోనా వైరస్ కారణంగా భయంతో కంపించిపోతోంది. ఎప్పుడు ఎన్ని కేసులు నమోదవుతాయోనని ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా భయంతో వణికిపోతున్నారు. రోజుకీ దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఇల్లు దాటి బయటికి రాకూడదని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కేంద్రం ఇప్పటికే లాక్ డౌన్ని పాటించాలని ప్రకటించింది.
దీంతో తెలంగాణ, ఆంధ్రాప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నెల 31 వరకు లాక్డౌన్ని ప్రకటించారు. ప్రజలు ఇల్లు దాటి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారిచేయడంతో సినీ ఇండస్ట్రీలో రిలీజ్ కోసం సిద్ధమవుతున్న చిత్రాల రిలీజ్లు ప్రశ్నార్థకంలో పడిపోయాయి. ఇప్పటికే కొన్నిచిత్రాల రిలీజ్లని వాయిదా వేశారు. ఈ నెల 31 వరకు థియేటర్లు కూడా బంద్ని పాటిస్తుండటంతో ఏప్రిల్, మే నెలల్లో రిలీజ్ కావాల్సిన చిత్రాలు కూడా వాయిదా పడుతున్నాయి. అందులో `వకీల్సాబ్` కూడా ఒకటి.
పవన్స్టార్ పవన్కల్యాణ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ముందు మే 15 రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభలు తుండటంతో ఈ చిత్ర రిలీజ్ని వాయిదా వేసినట్టు తెలిసింది. పవన్, దిల్ రాజు ఓ నిర్ణయానికి వచ్చిన రిలీజ్ని వాయిదా వేసినట్టు చెబుతున్నారు. రిలీజ్ లేట్ అయినా లేటెస్ట్గా రావాలనుకుంటున్నారట.