Homeటాప్ స్టోరీస్ఎక్స్‌క్లూసివ్‌: `వ‌కీల్‌సాబ్‌`కు జోడీ క‌న్ఫ‌మ్‌!

ఎక్స్‌క్లూసివ్‌: `వ‌కీల్‌సాబ్‌`కు జోడీ క‌న్ఫ‌మ్‌!

ఎక్స్‌క్లూసివ్‌: `వ‌కీల్‌సాబ్‌`కు జోడీ క‌న్ఫ‌మ్‌!
ఎక్స్‌క్లూసివ్‌: `వ‌కీల్‌సాబ్‌`కు జోడీ క‌న్ఫ‌మ్‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌`ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిల్ రాజుతో క‌లిసి బోనీ క‌పూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రేడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్‌, మ‌గువ మ‌గువ లిరిక‌ల్ వీడియోకు ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న లభించింది.

దంతో ఈ సినిమాపై అంచ‌నాలు స్కై హైకి చేరుకున్నాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల్లో అంజ‌లి, నివేదా థామ‌స్ న‌టిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ స‌గానికి పైగా పూర్తయిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్‌గా ప‌వ‌న్‌కు జోడీగా ఎవ‌రు న‌టిస్తార‌నే విష‌యంలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. ఇలియానా న‌టిస్తుంద‌ని, లేదా లావ‌ణ్య త్రిపాఠిని అడుగుతున్నారని, వీరిద్ద‌రూ కాదు శృతిహాస‌న్ న‌టించే అవ‌కాశాలే ఎక్కువ‌గా వున్నాయని వ‌రుస క‌థ‌నాలు వినిపించాయి.

- Advertisement -

అయితే తాజాగా ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శృతిహాస‌న్‌ని చిత్ర బృందం ఫైన‌ల్ చేసింది. ఇటీవ‌లే శృతి అఫీషియ‌ల్‌గా అగ్రిమెంట్ చేసుకున్న‌ట్టు తాజా స‌మాచారం. శృతిహాస‌న్ గ‌తంలో ప‌వ‌న్‌తో క‌లిసి `గ‌బ్బ‌ర్‌సింగ్‌`, కాట‌మ‌రాయుడు చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం ర‌వితేజ న‌టిస్తున్న `క్రాక్‌` చిత్రంలో న‌టిస్తోంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా `వ‌కీల్‌సాబ్‌` షూటింగ్‌ని ఆపేశారు. ప‌రిస్థితుల్ని బ‌ట్టి ఈ నెలాఖ‌రు నుంచి లేదా ఏప్రిల్ మొద‌టి వారం నుంచి షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశం వుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All