Homeటాప్ స్టోరీస్ప‌వ‌న్‌తో ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా?

ప‌వ‌న్‌తో ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా?

ప‌వ‌న్‌తో ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా?
ప‌వ‌న్‌తో ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లో బిజీగా మారిపోయిన విష‌యం తెలిసిందే. `పింక్‌` రీమేక్‌లో న‌టిస్తున్న ప‌వ‌న్ ఈ సినిమాతో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ జాన‌ప‌ద చిత్రాన్నికూడా చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా కోసం ప‌లు భారీ సెట్‌లని నిర్మించి షూటింగ్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే మ‌రో షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.

ఇదిలా వుంటే ప‌వ‌న్‌కల్యాణ్ మ‌రో మూడు చిత్రాల‌కు కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. హ‌రీష్‌శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీమేక‌ర్స్ నిర్మించ‌నున్న సినిమాతో పాటు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత ఎస్‌. రాధాకృష్ణ నిర్మించ‌నున్న సినిమా ఒక‌టి. ఇవే కాకుండా తాజాగా మ‌రో సినిమాకు సంబంధించిన టాక్ వినిపిస్తోంది. 2015లో `బాలీవుడ్ హిట్ చిత్రం `ఓ మై గాడ్‌` ఆధారంగా వ‌చ్చ‌న చిత్రం `గోపాల గోపాల‌`.

- Advertisement -

ప‌వ‌న్‌క‌ల్యాణ్, విక్ట‌రీ వెంక‌టేష్ క‌లిసి న‌టించిన ఈ చిత్రాన్ని కిషోర్ కుమార్ పార్థ‌సాని రూపొందించారు. భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయినా ఫ‌ర‌వాలేద‌నిపించింది. త్వ‌ర‌లో ఇదే చిత్రానికి సీక్వెల్‌ని తెర‌పైకి తీసుకురావాల‌ని ద‌ర్శ‌కుడు కిషోర్ కుమార్ పార్థ‌సాని ప్లాన్ చేస్తున్నార‌ట‌. మంచి క‌థ కుదిరితే త‌ప్ప‌కుండా సీక్వెల్ చేద్దామ‌ని ప‌వ‌న్ మాటివ్వ‌డంతో కిషోర్ ఓ క‌థ‌పై గ‌త కొన్ని నెల‌లుగా వ‌ర్క్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. అనుకున్న‌ట్టు మంచి క‌థ సెట్ట‌యితే `గోపాల గోపాల-2` తెర‌పైకి రావ‌డం ఖాయ‌మే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All