తెలుగులో బ్లాక్బస్టర్ హిట్లుగా నిలిచిన చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. అక్కడ సంచలన విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతున్నాయి. ఇదే ఇటీవల తెలుగులో సంచలనం సృష్టించిన `అర్జున్రెడ్డి` బాలీవుడ్లో రీమేక్ అయి దాదాపు 350 కోట్లకు మించి వసూళ్లని రాబట్టిన విషయం తెలిసిందే. తాజాగా నాని నటించిన `జెర్సీ` చిత్రం కూడా బాలీవుడ్కు వెళుతోంది. షాహీద్ కపూర్ నటిస్తున్న ఈ సినిమా గురువారం లాంఛనంగా ముంబైలో మొదలైంది. బాలీవుడ్లో సంచలన విజయాన్ని సాధించిన `పింక్` సినిమా తెలుగులో రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే తమిళంలో `నేర్కొండ పార్వై` పేరుతో రూపొంది అక్కడ సంచలనం సృష్టించింది. అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఆయన ఇమేజ్కు అనుగుణంగా కమర్షియల్ హంగుల్ని జోడించి `ఖాకీ` ఫేమ్ వినోద్ తెరపైకి తీసుకొచ్చారు. ఇదే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. బోనీకపూర్తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవర్స్టార్ పవన్కల్యాణ్ హీరోగా నటిస్తున్నారు. `ఎంసీఏ` ఫేమ్ శ్రీరామ్ వేణు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. తెలుగు నేటికి, పవన్ ఇమేజ్కి అనుగుణంగా కమర్షియల్ అంశాల్ని జోడించి ఈ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
గురువారం మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న చిత్ర వర్గాలు ఈ సినిమా ముహూర్త సన్నివేశాలని, పూజా కార్యక్రమాలని హైదరాబాద్లోని దిల్ రాజు ఆఫీస్లో సైలెంట్గా కానిచ్చేసినట్టు తెలిసింది. ఈ కార్యక్రమానికి హీరో పవన్కల్యాణ్ డుమ్మా కొట్టారట. హీరో లేకుండా దిల్ రాజు తొలి సారి ఓ సినిమా ముహూర్తాన్ని పూర్తి చేయడం ఇదే మొదటి సారి కావడం అంతా చర్చించుకుంటున్నారు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇందులోని కీలక పాత్ర కోసం చిత్ర బృందం సమంతాను సంప్రదించినట్లు తెలిసింది.