పవర్స్టార్ పవన్కల్యాణ్ `అజ్ఞాతవాసి` తరువాత సినిమాలకు బ్రేకిచ్చి క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత ఏపీ ఎన్నికల్లో యాక్టీవ్ పార్ట్ తీసుకుని జనసేన తరుపున పోటీకి దిగారు. దీంతో మళ్లీ పవన్ కెమెరా ముందుకు రావడం అనుమానమే అనే సంకేతాలు వినిపించాయి. అయితే ఏపీలో జరిగిన ఎన్నికల్లో జనసేనా తరుపున పవన్ ఒక్క అభ్యర్థిని తప్ప తనని కూడా గెలిపించుకోలేకపోవడంతో మళ్లీ సినిమాల్లో పవన్ నటించడం ఖాయం అని పవర్స్టార్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవలే పవన్కల్యాణ్ `పింక్` రీమేక్లో నటించబోతున్నారని వార్తలు వెలువడ్డాయి. శ్రీదేవి భర్త బోనీకపూర్తో కలిసి ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రీమేక్ ద్వారా పవన్ మళ్లీ సినిమాల్లో తన స్పీడుని పెంచబోతున్నారు. బాలీవుడ్లో అమితాబ్ పోషించిన పాత్రని తెలుగులో పవన్కల్యాణ్ పోషించబోతున్నారు. ఇప్పటికే `పింక్` రీమేక్ని తమిళంలో `నేర్కొండ పార్వై` పేరుతో రీమేక్ చేశారు. `ఖాకీ` ఫేమ్ హెచ్. వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అజిత్ స్టార్డమ్కి తగ్గట్టుగా కథలో కమర్శియల్ అంశాల్ని జోడించి తెరపైకి తీసుకొచ్చారు. తమిళంలో రిలీజైన ఈ చిత్రం అజిత్ కెరీర్లోనే భారీ వసూళ్లని సాధించిన చిత్రంగా నిలిచి విమర్శకుల ప్రశంసలందుకుంది.
ఇదే తరహాలో తెలుగు రీమేక్ని కూడా పవన్ ఇమేజ్కి అనుగుణంగా మార్పులు చేసి కొత్త పంథాలో తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నఈ చిత్రాన్ని జనవరిలో పట్టాలెక్కించబోతున్నారు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టిన మేకర్స్ ముగ్గురు కొత్త అమ్మాయిల్ని ఎంపిక చేసే పనిలో బిజీగా వున్నారట. తాప్సీ పోషించిన పాత్ర కోసం మంచి నటిని వెతుకుతున్నారట. ఇందులో పవన్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్తో కనిపిస్తారా? లేక స్టైలిష్ లాయర్గా కనిపిస్తారా అన్నది ఇంకా తెలియాల్సి వుంది.