జనసేనా అధినేత, హీరో పవర్స్టార్ పవన్కల్యాణ్ తన వ్యక్తిగత సిబ్బందితో పాటు పార్టీకి చెందిన కొంత మంది కోవిడ్ బారిన పడ్డారని తెలిసి ఫ్యామిలీతో కలిసి ఫామ్ హౌస్కి వెళ్లిపోయారు. అయితే తాజాగా నిర్వహించిన టెస్టుల్లో పవన్కు కోవిడ్ పాజిటివ్ అని తేలిసింది. దీంతో ఆయనకు ప్రతేకంగా డాక్టర్ల ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారని జనసేన పార్టీ వర్గాలు శుక్రవారం సాయంత్రం ప్రకటించాయి.
`జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్కు కోవిడ్ సోకినట్టుగా నిర్ధారణ కావడంతో నిపుణులైన వైద్యుల ఆధ్యర్యంలో ఆయనకు చికత్స జరుగుతోంది. ఈ నెల 3న తిరుపతిలో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొని పవన్ హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం ఆయనకు కరోనా టెస్ట్ చేయించగా నెగెటివ్ వచ్చింది. అయినా కూడా వైద్యుల సూచన మేరకు వ్యవసాయ క్షేత్రంలో క్వారెంటైన్లో వున్నారు. తాజాగా కొద్ది పాటి జ్వరం, ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతుండటంతో మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవడంతో ఫలితం పాజిటివ్ అని వచ్చింది. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ తంగెళ్ల సుమన్ ఆధ్వర్యంలో పవన్కు చికిత్స అందిస్తున్నారు. ఊపిరి తిత్తుల్లో కాస్త నిమ్ము చేరడంతో యాంటీ వైరల్ మందులతో చికిత్స అందిస్తున్నారు.
పవన్కల్యాణ్ పాజిటివ్ అని తెలియడంతో ఆయన సోదరుడు చిరంజీవితో పాటు సురేఖ, రామ్చరణ్, ఉపాసన, నిర్మాత నాగవంశీలు ఎప్పటికప్పుడు పవన్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అపోలో నుంచి కూడా ఒక వైద్య బృందం పవన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. తన ఆరోగ్యం నిలకడగానే వుందని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అబిమానుల ముందుకు వస్తానని పవన్కల్యాణ్ తెలిపారని జనసేన వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.